SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.
- By Naresh Kumar Published Date - 12:53 PM, Wed - 16 February 22
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది. భారీ మొత్తంతో మెగా వేలల్లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఒక్క ఆటగాడిని కూడా దక్కించుకోలేకపోయింది. వేలం ముందు నుంచి కేవలం అన్క్యాప్డ్ ప్లేయర్లే లక్ష్యంగా ముందుకెళ్లిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ చివరి వరకూ అదే వ్యూహాన్ని ఫాలో అయింది. ఈ క్రమంలో.. తక్కువ ధరకే స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలు చేయలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అనుసరించిన వ్యూహాలపై సోషల్ మీడియాలోఅభిమానులు తమదైన శైలిలో ట్రోల్చేస్తున్నారు. సన్రైజర్స్ ఫ్రాంచైజీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనేందుకు రాలేదని.. ఇక్కడ అందించే కూల్ డ్రింక్స్ కోసం వచ్చారని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ లో లేని నికోలస్ పూరన్ ను రూ.10.75 కోట్లు, షెఫర్డ్ ను రూ.7.75 కోట్లు, అభిషేక్ శర్మ రూ.6.5 కోట్లకు దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
మెగా వేలంలో ఆఖరికి రూ.10 లక్షల మినహా మొత్తం ఖర్చు పెట్టేసిన సన్రైజర్స్ హైద్రాబాదు.. కేవలం 20 మందినే కొనుగోలు చేసింది. ఇందులో సగానికిపైగా అన్క్యాప్డ్ ప్లేయర్లే ఉండటం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మొత్తంగా ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో లో 23 మంది ఉండగా.. ఇందులో 8 మంది విదేశీయులు ఉన్నారు… అయితే ఐపీఎల్ తో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ట్రోఫీ సాధించడం ఈసారి కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.
Related News
IPL Tickets: బ్లాక్ లో ఐపీఎల్ టికెట్స్.. ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్
IPL Tickets: IPL టికెట్లను బ్లాక్ అమ్ముతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగ యువకులను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. SOT మాదాపూర్ టీమ్ కొండపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో వికారైస్తున్నారనే సమాచారం తో ముగ్గురు ఉద్యోగస్తు లైన యువకులను పట్టుకున్నారు. వారి నుండి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో