Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
- By HashtagU Desk Published Date - 12:02 PM, Wed - 16 March 22
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, అక్కడి సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో పాటు, పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సిద్ధూలు ఘోరంగా ఓటమి పాలయ్యారు.
ఈ నేపధ్యంలో ఐదేళ్లపాటు పంజాబ్లో అధికారంలో ఉండి కూడా, తాజా ఎన్నికల్లో అక్కడ కనీస స్థానాలను సాధించలేకపోయిన కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన సోనియా గాంధీ, వెంటనే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను హైకమాండ్కు పంపిన సిద్ధూ, ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ
— Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022
Related News
Ulgulan Nyay Rally : ‘ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ’ పేరు వెనుక ఇంత అర్థముందా..?
గిరిజన నాయకుడు బిర్సా ముండా 1895లో బెంగాల్ ప్రెసిడెన్సీ (ఇప్పుడు జార్ఖండ్)లో బ్రిటిష్ వలస పాలన మరియు క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు, అది ఉల్గులన్ లేదా 'గొప్ప అల్లకల్లోలం' అని పిలువబడింది.