MLC Kavitha: జాతీయ మహిళా కాన్ఫరెన్స్ కు కవిత!
జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది.
- By Balu J Published Date - 03:09 PM, Tue - 24 May 22
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేరళ అసెంబ్లీ నిర్వహించనున్న జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 25-27 వరకూ తిరువనంతపురంలో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 26 న నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం అనే అంశం పై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు అదే అంశంపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ గవర్నర్ రీటా ఖండూరీ , అన్నీ రాజా ( Annie Raja ) సైతం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
Related News
Kerala: మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
కేరళలోని కన్నూర్లో మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు.