National Herald Case: హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు, కాంగ్రెస్ హైరానా!
హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు, రాహుల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
- By CS Rao Published Date - 11:41 AM, Fri - 5 August 22
హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు, రాహుల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆ పార్టీ లోక్సభాపక్షనేత మల్లిఖార్జున ఖార్గేను ఈడీ విచారించిన తరువాత ఆ కేసు మరింత సీరియస్ అయింది. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ సేకరించింది. వాటిని బేస్ చేసుకుని సోనియా, రాహుల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం, సోనియాగాంధీ ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యంగ్ ఇండియా ఆఫీస్ ను సీజ్ చేసిన తరువాత ఈడీ దూకుడుగా ముందుకు వెళుతోంది. సోనియా, రాహుల్ ను పలు విడతలుగా విచారించిన ఈడీ గురువారం మల్లిఖార్జున ఖార్గేను నుంచి కొన్ని క్లూలను లాగినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా మరింత వేగవంతంగా దర్యాప్తును చేయడానికి సిద్ధం అయింది. ఆ క్రమంలో అరెస్ట్ ల పర్వం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జిఎస్టి రేట్ల పెంపుపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఇంకో వైపు యంగ్ ఇండియన్ కార్యాలయం, ఎఐసిసి ప్రధాన కార్యాలయం వెలుపల కేంద్రం పోలీసులను మోహరించింది. అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఢిల్లీ పోలీసులు బుధవారం నుంచి పెద్ద ఎత్తున ఉన్నారు. టెన్ జనపథ్లోని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసాన్ని, 12, తుగ్లక్ లేన్లోని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారని కాంగ్రెస్ చెబుతోంది. యంగ్ ఇండియన్ లాభాపేక్ష లేని సంస్థ అని మరియు డబ్బు సంపాదించడం మరియు లాండరింగ్ చేయడంలో “ప్రశ్న లేదు” అని కాంగ్రెస్ చేసిన వాదనను ED అధికారులు తిరస్కరించారు. “యంగ్ ఇండియన్ 2010 నుండి ఎలాంటి ధార్మిక కార్యకలాపాలు నిర్వహించలేదు. వాణిజ్య వ్యాపారంలో నిమగ్నమై ఉంది. 800 కోట్లకు పైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిపై అద్దెలు ఆర్జిస్తోంది. అందువల్ల, ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నప్పటికీ, ప్రయోజనం స్వచ్ఛంద ప్రయోజనాల కోసం వెళుతుందనే వాదన సమర్థించలేని వాదన, ”అని ఆగస్టు 3న ఈడీ అధికారి ఒకరు చెప్పారు. AJL , యంగ్ ఇండియన్ రిజిస్టర్డ్ కంపెనీలని, ప్రతి లావాదేవీ పబ్లిక్ డొమైన్లో ఉంటుందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే అన్నారు.
2012లో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు మరియు న్యాయవాది సుబ్రమణ్యస్వామి ట్రయల్ కోర్టులో కొంతమంది కాంగ్రెస్ నాయకులు యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో మోసం, నమ్మక ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను వైఐఎల్ దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నదని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన విచారణలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ED ప్రస్తుతం వాటాల నమూనా, AJL మరియు YIL ఆర్థిక లావాదేవీలు , రెండు సంస్థల పనితీరులో పార్టీ కార్యకర్తల పాత్రను పరిశీలిస్తోంది. మొత్తం మీద ఈడీ దూకుడు అరెస్ట్ ల దిశగా వెళుతుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు దిగనుంది.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.