Biggest Ever Drug Raid : వేలకోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు
- By Pasha Published Date - 10:35 AM, Tue - 6 June 23
సీక్రెట్ గా దేశవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముతున్న అతిపెద్ద ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మంగళవారం రట్టు చేసింది. ఇప్పటివరకు దేశంలో మునుపెన్నడూ ఇంత భారీగా LSD డ్రగ్స్ పట్టుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ముఠా ఇంటర్నెట్ లో అత్యంత రహస్యమయంగా ఉండే డార్క్ వెబ్ ద్వారా పని చేస్తోందని వెల్లడించాయి. డార్క్ వెబ్ లోనే డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకొని.. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని తమ రహస్య ఏజెంట్ల ద్వారా సప్లై చేస్తుండేదని అధికారులు చెప్పారు.
Also read : Biggest Ever Drug Raid : వేల కోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు
సైబర్ క్రైమ్ పోలీసులకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కంటపడకుండా ఉండేందుకు ఈ ముఠా సభ్యులు చాటింగ్స్ కూడా డార్క్ వెబ్ లోనే చేసేవారని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఆ గ్యాంగ్ సభ్యులు ది ఆనియన్ రౌటర్ (ToR) అనే పేరు కలిగిన రహస్య బ్రౌజింగ్ సాఫ్ట్ వేర్ ను వాడేవారని వివరించారు. హాలూసినోజెన్ కేటగిరిలోకి వచ్చే లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (LSD) అనే సింథటిక్ రసాయన ఆధారిత డ్రగ్ ని ఈ ముఠా సభ్యులు పెద్దఎత్తున సప్లై చేసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు వేల కోట్లు విలువ చేసే ఈ డ్రగ్ నే భారీ పరిమాణంలో పట్టుకున్నామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
Tags
Related News
Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.