MS Dhoni: ధోనీ యాడ్ పై వివాదం.. తొలగించాలని ఆదేశం
ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన ఓ యాడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
- By Naresh Kumar Published Date - 05:20 PM, Fri - 8 April 22
ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన ఓ యాడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఐపీఎల్ను ప్రసారం చేసే స్టార్స్పోర్ట్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ఈ సీజన్ కోసం ధోనితో ఓ యాడ్ చేయించింది. ఈ యాడ్ లో ఖాకీ చొక్కా.. ఖాకీ ప్యాంటు.. వేసుకున్న ధోని బస్డ్రైవర్ గా అదరగొట్టాడు. ఈ వీడియోలో బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోన్న ధోనీ.. ఓ షాప్ లో ఐపీఎల్ మ్యాచ్ రావడం గమనించి ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్ని ఆపేస్తాడు. దాంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుంది.. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ ఆ మ్యాచ్ చూడాలనీ చెప్తాడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.
ఆ సమయంలో అటుగా వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సును రోడ్డు మధ్యలో ఎందుకు ఆపేశావని ప్రశ్నించగా- సూపర్ ఓవర్ నడుస్తోందంటూ ధోని సమాధానం ఇస్తాడు ధోనీ. దాంతో ట్రాఫిక్ పోలీసు కూడా ఓకే తలా అంటూ వెళ్లిపోతాడు.. అయితే ఈ యాడ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెరకెక్కించిన ఈ ఈ యాడ్పై మండిపడిన రోడ్ సేప్టీ ఆర్గనైజేషన్.. అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)కి కంప్లైంట్ చేసింది. దాంతో.. ఈ యాడ్ను ఏప్రిల్ 20లోపు తొలగించాలని స్టార్ స్పోర్ట్స్ ను ఏఎస్సీఐ ఆదేశించింది. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ధోనితో రూపొందించిన ఈ యాడ్ని తొలగించనున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ 2022లో ఎంఎస్ ధోని ఆడుతున్న సీఎస్కే జట్టు ఇంకా బోణీ చేయలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో హ్యాట్రిక్ పరాజయాలు చూసిన చెన్నై సూపర్ కింగ్స్ అనవసర ఒత్తిడిలో పడుతోంది.
Tags
Related News
Dinesh Karthik: ధోనీ సిక్స్ కొడితే ఆర్సీబీ గెలవటం ఏమిటి..? దినేష్ కార్తీక్ ఏం చెప్పాడంటే..!
IPL 2024లో శనివారం రాత్రి M చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.