Uttar Pradesh: ఐదవ ప్రేమికుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. చివరికి ఏం జరిగిందంటే?
ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లయిన వివాహితలు వివాహేతర సంబంధాల మోజులో పడి తాళి కట్టిన భర్తను కడుపున పుట్టిన పిల్లలను కూడా కాద
- By Nakshatra Published Date - 04:37 PM, Sun - 3 September 23
ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లయిన వివాహితలు వివాహేతర సంబంధాల మోజులో పడి తాళి కట్టిన భర్తను కడుపున పుట్టిన పిల్లలను కూడా కాదనుకొని ప్రియుడి కోసం వెళ్ళిపోతున్నారు. ఇంకొందరు వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని పిల్లలను భర్తను చంపడానికి కూడా వెనకాడడం లేదు. అయితే కూడా ఒక మహిళ ప్రియుడి కోసం ఏకంగా ముగ్గురు పిల్లలను భర్తను కూడా కాదనుకొని వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆజంగఢ్లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది.
వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. దాంతో బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. భర్త అనిల్ రాజ్భర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను పనుల నిమిత్తం గతంలో చండీగఢ్ వెళ్లానని, అక్కడే రీనా అనే యువతితో పరిచయం అయ్యిందని తెలిపాడు. అయితే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో మేము వింద్యాచల్ మందిరంలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి తరువాత మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేశాము. ఇక్కడే కాపురం పెట్టామని, నాకు ముగ్గురు పిల్లలు కూడా కలిగారు. ఈ విధంగా 9 ఏళ్లు గడిచింది.
నేను రాజ్భర్ పని కోసం తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడిని, ఈ సమయంలో ఆమె ఎవరితోనే మాట్లాడుతుండేదని నేను గమనించాను. ఈ విషయమై ఆమెను ప్రశ్నంచగా ఆమె జవాబు చెప్పకుండా తప్పించుకునేది. అయితే ఇటీవల ఆమెకు ఎవరి దగ్గరి నుంచో ఫోను వచ్చింది. దీంతో ఆమె బయట ఏదో పని ఉందని వెళ్లింది. రాజ్భర్ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఇంటిలో లేదు. పిలలకు కూడా తల్లి ఎక్కడకు వెళ్లిందో తెలియలేదు. దీంతో నాకు తెలిసిన అన్ని ప్రాంతాలలో వెతికాను. కానీ నా భార్య ఆచూకీ దొరకలేదు. అప్పుడు వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు కూడా ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది. దీంతో చేసేది ఏమీ లేక నేనే నా పిల్లలతో కలిసి నా భార్య పోస్తాన్ని పట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పుకొచ్చారు. నా భార్యకు ఎంతో మంది స్నేహితులు, ప్రేమికులు ఉండేవారని చెప్పేదని, దానిని తాను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదని ఆయన అన్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె తన ఐదవ ప్రేమికుని గురించి చేప్పేదని, అతనితోనే తన భార్య వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానం కలుగుతున్నదని రాజ్ భర్ పోలీసులకు వెల్లడించారు.
Related News
Madhya Pradesh: వైవాహిక శృంగారం నేరం కాదు
భార్యాభర్తల మధ్య జరిగే ఏ విధమైన లైంగిక కలయిక అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భార్య అంగీకారానికి సంబంధం లేదని, అందుకే అది అత్యాచారం కాదని కోర్టు పేర్కొంది.