HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Modi Announces Rs 2 Lakh Ex Gratia For Kamareddy Road Accident Victims Kin

Modi Ex-gratia: కామారెడ్డి మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది  మృతిచెందారు.

  • Author : Balu J Date : 09-05-2022 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది  మృతిచెందారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50,000 పరిహారం కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఓ ట్వీట్‌ చేసింది “తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రాణనష్టం కలగడం బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మరణించిన బంధువులకు అందించబడుతుంది. కాగా ప్రమాదంలో గాయపడినవాళ్లకు రూ.50,000 ఇస్తాం’’ అని వెల్లడించింది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో లారీ, మినీ వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. మినీవ్యాన్‌లోని వ్యక్తులు యల్లారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి నిందితుడు లారీ డ్రైవర్‌ను గుర్తించినట్లు కామారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “మేం అతన్ని త్వరలో పట్టుకుంటాము’’ అని అన్నారు.  మృతుల వివరాలు ఇవే.. అంజవ్వ (35 సంవత్సరాలు), వీరమణి (35 సంవత్సరాలు), లచ్చవ్వ (60 సంవత్సరాలు), సాయవ్వ (38 సంవత్సరాలు), సాయిలు (35 సంవత్సరాలు), ఎల్లయ్య (53 సంవత్సరాలు), పోశయ్య (60 సంవత్సరాలు), గంగవ్వ ( 45 ఏళ్లు), వీరవ్వ (70 ఏళ్లు).

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి అందజేయబడుతుంది. : ప్రధాని మోదీ

— PMO India (@PMOIndia) May 9, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ex-gratia
  • Kamareddy Incident
  • pm modi
  • PMO twitter

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd