Errabelli Dayakar Rao: రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
- By Balu J Published Date - 06:02 PM, Sat - 14 October 23
Errabelli Dayakar Rao: జనగామ జిల్లా బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతుంది, డబ్బులకు టికెట్స్ అమ్మకుంటున్నరు అని కాంగ్రెస్ పార్టీ వాల్లే విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లు అమ్ముకుంటడు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతాండు. గోడలకు పేయింటింగ్ లు వేసే వాడివి… నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు, నీ కుటుంబ మేంది? నీ బతుకేంది.?’’ అంటూ ఎర్రబెల్లి మండిపడ్డారు.
‘‘సంవత్సరానికి ఒక పార్టీ మారే బతుకు నీది. కొడంగల్ లో చిత్తుగా ఓడిపోయావు, బ్రోకరు మాటలెందుకు, దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలువు. పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తో కాంగ్రెస్ పార్టీ మెుత్తం పడిపోతది. ప్రజలు మిమ్నల్ని నమ్మే పరిస్థితి లేదు, పక్క రాష్ట్రాలలో 6 గ్యారెంటీలు ఇయ్యని మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్రజలు ఎట్ల నమ్ముతరు.?!’’ మంత్రి ఎర్రబెల్లి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు.
Related News
Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న.. ఏమార్చడంలో ఎవర్గ్రీన్ చంద్రబాబు : రోజా
Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న అని, ఏమార్చడంలో ఎవర్గ్రీన్ చంద్రబాబు అని మంత్రి ఆర్కేరోజా అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఇరుగువాయి పంచాయతీ పరిధిలో ఇరుగువాయి, ఇరుగువాయి హరిజనవాడ, ఇరుగువాయి ఎస్టీ కాలనీ, పర్వతరాజపురం, పర్వతరాజపురం ఎస్టీ కాలనీలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మంగళ హరతులు పట్టారు. యువత జేజేలు పలికారు. ఉత్సాహంగా ఉరకలు వేస్�