Marri Shashidhar Reddy: బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 09:57 PM, Wed - 16 November 22
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. దీనిపై శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని… తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత పనుల మీదే తాను ఢిల్లీకి వచ్చానని అన్నారు. తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తెలిపారు.
ప్రతి నెల తాను ఢిల్లీకి వస్తూనే ఉంటానని… అయితే ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరిగిందని… ఇది తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.
Related News
Dharmapuri : ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్..
Dharmapuri Srinivas: కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ(bjp) ఎంపీ ధర్�