Traditional Job:ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలి పశుపోషణ.. రూ.లక్షలు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తి?
దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది
- By Nakshatra Published Date - 10:15 AM, Sun - 17 July 22
దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసే వారి సంఖ్య కంటే నిరుద్యోగుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కాగా దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఆందోళన చెందుతోంది. అయితే చాలామంది ఉద్యోగాలు లేక కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ఉన్న జాబులను వదిలేస్తున్నారు. అయితే నిరుద్యోగ యువత జీవితాలు అంతంత మాత్రమే ఉండగా ఈ కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.
లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అయితే వీరికి భిన్నంగా ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలేసి ఆవుల పోషణ చేపట్టిన ఒక యువకుడు అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు. ఆవు పాలు, పేడ అమ్మడం ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే..కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన జయగురు ఆచార్ హిందర్ సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. అయితే చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం కూడా చేశాడు. కానీ అతని మనసు ఉద్యోగం పై నిమగ్నం కాలేదు.
జయగురుకు మొదటి నుంచి వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో 2019లో ఉద్యోగం వదిలేసి తండ్రితో పాటు కలిసి వ్యవసాయ పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా అతి తక్కువ సమయంలో 130 ఆవుల పోషణ చేపట్టాడు. జయగురు డెయిరీ నెలకొల్పి, పాల ఉత్పత్తుల విక్రయం చేపట్టాడు. పటియాలాలో ఆవు పేడను ఎండబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాడిపనుల కోసం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రతి నెలా 10 లక్షల రూపాయలు సంపాదిస్తు ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జయగురు. దేశవ్యాప్తంగా జయ గురు తో పాటు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఉద్యోగం విషయంలో తగిన సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో వారికి నచ్చిన పనిని చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
Related News
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.