Vishal: ‘లైకా’ ఎఫెక్ట్… హీరో ‘విశాల్’ ను రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ‘చైన్నై హైకోర్ట్’ ఆదేశం!
- By hashtagu Published Date - 02:11 PM, Sun - 13 March 22
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో… రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని తమిళ స్టార్ హీరో విశాల్ ను మద్రాస్(చెన్నై) హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, అప్పుగా తీసుకున్న రూ. 21.29 కోట్లు చెల్లించకుండానే ‘వీరమే వాగై సుడుం’ అనే సినిమాను రిలీజ్ చేసేందుకు విశాల్ రెడీ అయ్యారంటూ లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
అలానే సినిమాను విడుదల చేయడమే కాకుండా శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు విశాల్ ప్రయత్నిస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది. ఈ నేపధ్యంలో ‘వీరమే వాగై సుడుం’ మూవీ రిలీజ్, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని చెన్నై హైకోర్టును కోరింది. శనివారం ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు విన్న జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని హీరో విశాల్ ను ఆదేశిస్తూ… తదుపరి విచారణను ఈనెల 22 కు వాయిదా వేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి రూ.15 కోట్ల వ్యవహారంలో హీరో విశాల్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Related News
Vishal : జగన్పై జరిగిన రాయి దాడిపై.. హీరో విశాల్ ఏమన్నారంటే..
జగన్పై జరిగిన రాయి దాడిపై హీరో విశాల్ మాట్లాడుతూ.. జగన్ గారు రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి.