మొబైల్ గేమ్ ఆడనివ్వలేదని కన్నతల్లిని కాల్చి చంపిన యువకుడు.. ఎక్కడంటే?
- By Nakshatra Published Date - 11:38 AM, Wed - 8 June 22
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులే పిల్లలకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక మాట అంటే పిల్లలు ఎక్కడ అపార్ధం చేసుకుని ఏదైనా చేసుకుంటా రేమో అన్న భయంతో తల్లిదండ్రులు ఒక మాట అనాలి అన్న కూడా భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు మందలించారని ఏకంగా పిల్లలే తల్లిదండ్రులను చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో 16 ఏళ్ల బాలుడు కోపంతో ఏకంగా కన్నతల్లినే కాల్చిచంపాడు. 40 ఏళ్ల సాధన అనే మహిళ భర్త ఆర్మీలో పని చేస్తూ కోల్కతాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దంపతులకు పదహారేళ్ల కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అయితే ఈ కుటుంబం ప్రస్తుతం లక్నోలోని పిజి ఐ కాలనీలో నివసిస్తున్నారు. తాజాగా కొడుకు మొబైల్ లో గేమ్స్ తరచుగా ఆడుతున్న డంతో సాధన దాన్ని అడ్డుకుంది. దీంతో ఆ 16 ఏళ్ల బాలుడు కోపం కట్టలు తెంచుకునే వెంటనే తన తండ్రి తీసుకొని తల్లి తల్లి పై కాల్చాడు. దీని దాంతో సాధన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని చంపిన తరువాత ఆ సోదరిని వేరే గదిలో ఉంచి గడియ పెట్టాడు. అలా శవం పక్కనే దాదాపుగా మూడు రోజుల పాటు గడిపాడు. ఆ శవం నుంచి దుర్వాసన వస్తుండడంతో రూమ్ ఫ్రెష్ నర్ కొట్టేవాడు. ఇక చివరికి ఈ మూడు రోజుల తర్వాత తనకి కాల్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. బాలుడు తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాగా ఆ బాలుడు పిచ్చి కాల్చి చంపినట్టు కట్టుకథ వినిపించగా ఆ తర్వాత పోలీసుల విచారణలో అసలు విషయాన్ని అంగీకరించాడు.
Related News
Bomb Threat Emails : కాన్పూర్, లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అక్కడి నుంచే ఈమెయిల్స్!
బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, జైపూర్, అహ్మదాబాద్లలోని స్కూళ్లకు కొన్నిరోజుల క్రితం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.