Ajit Dhoval: చైనాపై నమ్మకం సన్నగిల్లుతోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన అజిత్ ధోవల్?
వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్బర్గ్ల
- By Nakshatra Published Date - 03:04 PM, Tue - 25 July 23
వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదంతో పాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని అజిత్ ధోవల్ వాంగ్కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అలాగే రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అజిత్ అన్నారు.
అయితే ఇందుకోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. చైనా దూకుడు తగ్గించుకుంటేనే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ వాంగ్ యీ స్పందిస్తూ చైనా కూడా అజిత్ ధోవల్ ప్రస్తావించిన అంశాల పై సానుకూల దృక్పథం తోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చు అని తెలిపారు.
Related News
Chinese swimmers: డోపింగ్లో పరీక్షలో పాజిటివ్.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న చైనీస్ స్విమ్మర్లు..!
23 మంది చైనీస్ స్విమ్మర్లు డోపింగ్ పరీక్షలు సానుకూలంగా ఉన్నప్పటికీ టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేయడానికి అనుమతించబడ్డారు.