Super Cars: భారత్ లో దూసుకుపోతున్న లాంబోర్ఘిని…400 సూపర్ కార్లు డెలివరీ..!!
ఇటలీకి చెందిన సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని గడిచిన 15 సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- By Hashtag U Published Date - 09:25 AM, Wed - 30 March 22
ఇటలీకి చెందిన సూపర్ కార్ బ్రాండ్ లాంబోర్ఘిని గడిచిన 15 సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ 15ఏళ్ల కాలంలో కంపెనీ భారత మార్కెట్లో మొత్తం 400కార్లను విక్రయించింది. ఈ మధ్యే లాంబోర్ఘిని భారత్ లో తమ 400వ కారును డెలివరీ పూర్తి చేసింది. కంపెనీ 2007 సంవత్సరంలో భారత్ లో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. గత సంవత్సరంలో ఈ ఇటలీ కంపెనీ భారత్ లో తమ లగ్జరీ కార్ల విక్రయాల్లో అత్యధికంగా 86శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
లాంబోర్ఘిని 2019లో 52 యూనిట్ల గరిష్ట కారును బద్దలు కొట్టి..2021లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది నాటికి కంపెనీ భారత్ లో 300వ యూనిట్ కార్లను డెలివరీ మైలురాయిన చేరుకుంది. ఈ మధ్యే ఉరుస్ ఎస్ యూవీ 100వ యూనిట్ డెలివరీ మైలురైయిని చేరుకుంది. గడిచిన 2020 సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి భారత్ లో విస్తరించి ఉన్నప్పటికీ…లాంబోర్ఘిని 50ఉరుస్ లగ్జరీ ఎస్ యూవీలను విడుదల చేసింది. అంతకు ముందు 2019లో ఈ లగ్జరీ కార్ మేకర్ భారత్ లో 65 యూనిట్ల ఉరస్ కార్లను విక్రయించింది. ఇది 2018లో విక్రయాలతో పోల్చితే 30శాతం పెరిగింది. లాంబోర్ఘిని ఇండియా గతేడాది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారి ఉమ్లింగ్ లా పాస్ వద్ద సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో లాంబోర్ఘిని ఉరుస్ సూపర్ ఎస్ యూవీ శక్తి సామార్థ్యాలను ప్రదర్శించింది. దీంతో ఈ చాలామందిని ఆకట్టుకుంది.
లాంబోర్ఘిని కారును కొన్నవారంతా సెలబ్రిటీలే..
ఇక ఈ కారును కొనుగోలు చేసిన వారిలో ఎక్కువమంది సెలబ్రిటీలే ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఈ కారును కొనుగోలు చేశారు. ఇక భారత్ లో అమ్మకాల పరంగా లాంబోర్ఘిని బ్రాండ్ సాధించిన ఈ అరుదైన మైలురాయిని గుర్తించడానికి సూపర్ లగ్జరీ కార్ల విభాగంలో తమ నాయకత్వ స్థానాన్ని ప్రదర్శించడానికి లాంబోర్ఘిని ఇండియా తన మూడవ ఎడిషన్ లాంబోర్ఘిని డేను ప్రారంభించింది. భారత్ లో తమ బ్రాండ్ కస్టమర్ లకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో రూపొందించబడింది.
లాంబోర్ఘిని నుంచి ఎలక్ట్రిక్ కారు…
ఇక ఈ సూపర్ కార్ కంపెనీ ఇప్పుడు పెట్రోల్ కార్లలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు రెడీ అవుతోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో లాంబోర్ఘిని కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయ్యింది. రిపోర్ట్స్ ప్రకారం లాంబోర్ఘిని తమ మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారును 2027లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
Related News
Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..
'దేవర' ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన ఎన్టీఆర్. ఆల్ హెయిల్ టైగర్ అంటూ..