KTR: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న ‘కేటీఆర్’..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు.
- By Hashtag U Published Date - 07:48 PM, Fri - 18 February 22
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు మంత్రి కే.తారకరామారావు కి హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఈనెల 20వ తేదీన మంత్రి కేటీఆర్ ఇండియా @2030 – ట్రాన్స్ఫర్మేషనల్ డికేడ్ అనే అంశం పై మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. 20వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి ఈ సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంలో ప్రసంగించనున్నారు.
ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యము, ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్ ఇంక్యుబేటర్లు, ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు. తన ప్రసంగంలో మంత్రి కేటీఆర్ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు.
మరోవైపు తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్ లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Elated to have the H'ble Minister @KTRTRS deliver a keynote address at the conf! We look forward to hearing from him on the development he has undertaken in the State of Telangana and his views on Turbocharging India @ 2030!
Free & virtual, register here https://t.co/6jZd0mhROm pic.twitter.com/PXLZerDyoQ
— India Conference at Harvard (@HarvardIndiaCon) February 18, 2022
Related News
KTR: రేపు బంజారాహిల్స్ లో ఓటు వేయనున్న కేటీఆర్
KTR: తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో మే 13న నాలుగో విడత పోలింగ్ జరుగనుండగా, 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా రేపు ఉదయం జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్, నంది నగర్, బంజారాహిల్స్ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, �