TCongress: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
- By Balu J Published Date - 05:25 PM, Sat - 23 March 24
TCongress: సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చెట్లు పుట్టలు, రోడ్లు, గుట్టలకు, పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు డబ్బులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాలు రూపించే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకే పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు పెట్టుబడి విషయంలోనూ అదే టార్గెట్ పెట్టుకుంది.
ముందు నుంచి రైతుబంధును ఐదెకరాలకు పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. ఆ మేరకే విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసాకు 5 ఎకరాల పరిమితి విధించనున్నట్టు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో.. కేవలం 5 ఎకరాల స్థలం ఉన్నవారికే.. అది కూడా సాగు చేసే స్థలానికి మాత్రమే ఇవ్వాలని విధివిధానాలు తయారు చేస్తున్నట్టు సమాచారం.
Related News
Harish Rao: రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడని, ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదని హరీశ�