Kemburi Ramamohan Rao : మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత
విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు
- Author : Sudheer
Date : 08-08-2024 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
సీనియర్ రాజకీయ నేత కెంబూరి రామ్మోహన్ రావు (Kemburi Ramamohan Rao) (75) గురువారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కెంబూరి రామ్మోహనరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబరు 12 వ తేదీన జన్మించాడు.
We’re now on WhatsApp. Click to Join.
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టాను పొందాడు. 1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. 1989లో తొమ్మిదవ లోక్ సభ సాధారణ ఎన్నికలలో టీడిపి పార్టీ నుండి బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ..ఎంతో అభివృద్ధి చేసి వార్తల్లో నిలిచారు. ఈయన 1974లో రుషిని వివాహం చేసుకున్నాడు. ఈయన కు ఇద్దరు కుమార్తెలు. ఈయన మరణ వార్త తెలుసుకున్న అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు.
Read Also : DSC Updates : డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు ? కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ?