Keerthy Suresh: కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్!
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులు మహేశ్ బాబు, త్రిష, ఖుష్బూ, రేణుదేశాయ్, శోభన లాంటి కరోనా బారిన పడగా, తాజాగా మహనటి ఫేం కీర్తి సురేష్ కరోనా బారిన పడ్డారు.
- Author : Balu J
Date : 11-01-2022 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులు మహేశ్ బాబు, త్రిష, ఖుష్బూ, రేణుదేశాయ్, శోభన లాంటి కరోనా బారిన పడగా, తాజాగా మహనటి ఫేం కీర్తి సురేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ తేలినట్టు స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. డాక్టర్ల సూచన మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తు …హోమ్ ఐసోలేషన్ ఉంటోంది. నన్ను కలిసిన వారు కరోనా టెస్టు లు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కీర్తి సురేష్ కోరారు. అయితే ప్రస్తుతం కీర్తి సర్కారువారిపాటలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మూవీ హీరో మహేశ్ బాబు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Whatsapp Image 2022 01 11 At 20.16.27