KCR & Yashwant Sinha: బీజేపీ జాతీయ సమావేశాలకు `సిన్హా` రూపంలో చెక్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి పోటీ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు.
- By CS Rao Published Date - 02:09 PM, Fri - 1 July 22
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి పోటీ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం వద్ద ఆహ్వానం పలకడంతో పాటు జలవిహార్ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను రచించింది. అంతేకాదు, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సిన్హాకు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల జరుగుతోన్న వేళ బీజేపీ వ్యతిరేక శక్తులు హైదరాబాద్ కేంద్రంగా ఏకం కావడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తుగడగా నిలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేస్తున్న ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జూలై 2న ప్రచారానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు సిన్హా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. జలవిహార్ వరకు బైక్ ర్యాలీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రులు మరియు ఇతర టిఆర్ఎస్ నాయకులు సిన్హాకు ఘన స్వాగతం పలుకుతారు. ర్యాలీలో 5,000 నుంచి 6,000 బైక్లు ఉంటాయని అంచనా. జలవిహార్లో జరిగే సభలో సీఎం కేసీఆర్ సిన్హా ప్రసంగిస్తారు. సిన్హాకు జూలై 2న ఘనంగా రిసెప్షన్ నిర్వహించేందుకు జలవిహార్లో భారీ ఏర్పాట్లు చేయాలని నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆ మేరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ మహమూద్ అలీ, ఎంపీ జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీఎస్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ జలవిహార్లో పర్యటించి, ఏర్పాట్లను సమీక్షించారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసే సమావేశానికి హాజరైన తరువాత సిన్హా గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ శాసనసభ్యులను కలుసుకుంటారు. ఆ తరువాత AIMIM శాసనసభ్యులను కలుసుకుని మద్ధతు కోరతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. గతంలో 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో ఇదే వేదిక జలవిహార్లో కోవింద్కు టీఆర్ఎస్ కూడా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను ఏకం చేసే పనిలో పడింది. ఉమ్మడిగా సిన్హాను ఆహ్వానించడానికి బేగంపేట విమానాశ్రయానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ప్రతినిధులు వెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం వైపు ఉన్న ప్రజల మైండ్ ను విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి సిన్హా ర్యాలీ వైపు మళ్లేలా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం మాస్టర్ స్కెచ్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
Tags
Related News
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.