1000 Cr Relief:భద్రాచలం ముంపు బాధితులకు రూ.1000 కోట్లతో శాశ్వత కాలనీలు : సీఎం కేసీఅర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో తరచూ ముంపుకు గురౌతున్న భాదిత కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.
- By Naresh Kumar Published Date - 11:53 AM, Mon - 18 July 22
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో తరచూ ముంపుకు గురౌతున్న భాదిత కుటుంబాలకు శాశ్విత ప్రాతిపదికన ఎత్తైన ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ఆయన హామీ ఇచ్చారు . భద్రాచలంలో పర్యటించిన సీఎం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించారు .
వారితో మాట్లాడి ముంపు ప్రాంతాల్లో నివాసమే ఉండకుండా ఎత్తైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఇస్తుంది వెళ్లేందుకు సిద్దమేనా అని అడిగారు . అందుకు భాదితులు సమ్మతి తెలపడంతో వెంటనే వాటి అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జిల్లా కలెక్టర్ , మంత్రికి ఆదేశాలు జారీచేశారు. భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు . వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తామనీ, ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలనీ సూచించారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలనీ.సీఎం ఆదేశించారు.
శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులను భద్రాచలం రప్పించాలనీ, రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామనీ సీఎం కేసీఆర్ చెప్పారు. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామన్నారు. దీనికోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. ఇంకా వర్షాల ముప్పు పోలేదన్న సీఎం ఈ నెలాఖరుదాకా జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెప్పారు. ప్రస్తుతం
వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తామన్నారు.
అలాగే ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే
వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలీకాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్ ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.విద్యుత్ సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
CM Sri KCR has undertaken the aerial survey of areas affected by #GodavariFloods from Bhadrachalam to Eturunagaram. Hon'ble CM has examined the Godavari River in spate and the villages inundated by the floods in one of the worst natural disasters #Telangana has seen. pic.twitter.com/5QwlLuV5VW
— Telangana CMO (@TelanganaCMO) July 17, 2022
Related News
Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి
Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భ�