KA Paul Attack Video: కేఏ పాల్పై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
- By Hashtag U Published Date - 07:12 PM, Mon - 2 May 22
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకుని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఏకంగా డీఎస్పీ ముందే కేఏ పాల్ పై వారు చేయి చేసుకున్నారు.
అయితే దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తేనని కేఏ పాల్ చెబుతున్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడి ఘటన అనంతరం వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందకు కేఏ పాల్ వెళ్లారు.
Related News
Amit Shah : అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు
Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణ పర్యటన( Telangana Tour) కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అమిత్ షా బాన్సువాడకు బదులు సిద్దిపేట(Siddipet)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. We’re now on WhatsApp. Click to Join. మెదక్ బీజేపీ(bjp) అభ్యర్థి రఘునందనరావు(Raghunandana Rao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో […]