RRR: ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ రికార్ట్
త్రిబుల్ విడుదలకు ముందే రికార్ట్ సృష్టిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఢిల్లీ ఎన్ సీ ఆర్ లో ఒక్కో టిక్కెట్ రూ.
- By CS Rao Published Date - 03:55 PM, Thu - 24 March 22
త్రిబుల్ విడుదలకు ముందే రికార్ట్ సృష్టిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఢిల్లీ ఎన్ సీ ఆర్ లో ఒక్కో టిక్కెట్ రూ. 2,100లకు విక్రయించడం టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ ను కూడా షేక్ చేస్తోంది. మరో 24 గంటలలోపే త్రిబుల్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్ల నిరీక్షణ తరువాత ఈనెల 25న విడుదల కానున్న ఈ సినిమా టిక్కెట్ల దేశ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్లు నటించారు. SS రాజమౌళి డైరెక్షన్లో RRR మార్చి 25న విడుదల అవుతుంది. సినిమా హాళ్లు ఇప్పటికే హౌస్ఫుల్గా ప్రకటించడంతో టిక్కెట్ బుకింగ్ కష్టంగా మారింది. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య టిక్కెట్ల పోలికను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. సినిమా బుకింగ్ యాప్ బుక్ మై షోలో పన్నులు లేకుండా, ఢిల్లీ NCRలో RRR టిక్కెట్లు రూ. 2100 వరకు పలికడం త్రిబుల్ ఆర్ క్రేజ్ ను గుర్తు చేస్తోంది.
ముంబైలో, పన్నులు లేకుండా టికెట్ ధరలు ఒక్కొక్కరికి రూ. 1720 లతో అమ్ముడయ్యాయి. కోల్కతాలో పన్నులు లేకుండా రూ. 1090 టిక్కెట్ ధర పలికింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు , కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ను డివివి దానయ్య నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ , అలిసన్ డూడీ ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించనున్నారు.
Related News
RRR : రీ రిలీజ్కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..
గ్లోబల్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' రీ రిలీజ్కి సిద్దమవుతుంది. ఎప్పుడు..? ఏ భాషల్లో..?