HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Investigation Into Brs Corruption When Bjp Came To Power Kishan Reddy

Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి బీఆర్ఎస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.

  • By Balu J Published Date - 04:41 PM, Tue - 21 November 23
  • daily-hunt
Kishan Reddy spoke about BJP MLA Candidates announcement in Telangana
Kishan Reddy spoke about BJP MLA Candidates announcement in Telangana

Kishan Reddy: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీలోపే జీతాలు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రైతుకు ఉచితంగా దేశీయ ఆవును అందజేస్తామన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అంచనాలకు మించి బీజేపీకి మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవంలా చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు స్పందిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. అవినీతిరహిత పాలన అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష లు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పోవడం ఖాయం. మార్పు రావడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది”అని కిషన్ రెడ్డి అన్నారు.

ఎస్సీ వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉన్నందునే స్పీడప్ చేసేందుకు ఫాస్ట్​ట్రాక్ మాదిరిగా ఓ కమిటీ వేశామే తప్ప, జాప్యం చేసేందుకు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం అనుకూలమని కోర్టు ముందు చెప్పబోతున్నామన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదన్నారు. కర్నాటకలో 5 గ్యారెంటీలకే దిక్కులేదు.. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయ్ కానీ, చేతలు మాత్రం గాంధీభవన్, ప్రగతిభవన్ దాటవని మండిపడ్డారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజ మెత్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs govt
  • cm kcr
  • kishan reddy

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd