PM Modi: వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు : మోదీ
వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
- By Hashtag U Published Date - 02:38 PM, Fri - 15 April 22
వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పంతో వైద్యుల కొరత తీరబోతోందన్నారు. వైద్య విద్యను సామాన్యులకూ చేరువ చేయాలనే లక్ష్యం తో ముందుకు పోతున్నట్లు చెప్పారు. గుజరాత్ లోని భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 సంవత్సరం లో భుజ్ జిల్లాలో భూకంపం చోటుచేసుకున్న సమయానికి స్థానిక ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువని గుర్తు చేశారు.
స్వచ్ఛంద సేవా సంస్థ లు, వైద్యుల కృషితో భుజ్ పరిధిలో ఆస్పత్రులు పెరిగాయన్నారు. 2001 నాటికి గుజరాత్ లో 9 మెడికల్ కాలేజీలు, 1100 సీట్లే ఉండేవని.. ఇప్పుడు కాలేజీ ల సంఖ్య 36కు, సీట్ల సంఖ్య 6000కు చేరిందని మోదీ పేర్కొన్నారు.
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.