Hyderabad: హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. బాలానగర్ జోన్లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ , జీడిమెట్ల పోలీసులతో కలిసి ఒడిశాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకుని 400 కిలోల గంజాయి
- By Praveen Aluthuru Published Date - 06:01 PM, Sat - 16 December 23
Hyderabad: హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. బాలానగర్ జోన్లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ , జీడిమెట్ల పోలీసులతో కలిసి ఒడిశాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకుని 400 కిలోల గంజాయి మరియు ఒక లారీతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, మరియు దాదాపు కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన డ్రైవర్ బబ్లూ ఖరే అలియాస్ కృష్ణ (23), మరొకరు అమరావతి జిల్లాకు చెందిన గోవింద్ పాటిదార్ (42) అనే రైతు. ఒడిశాకు చెందిన సరఫరాదారు బబ్లూ.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బబ్లూ ఖరే, గోవింద్ పటీదార్ మధ్యప్రదేశ్కు చెందిన వారని, ఇద్దరూ గత కొన్నేళ్లుగా లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు గోవింద్ పాటిదార్ మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ధర్నే గ్రామంలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు బబ్లూ ఖరేకు గోవింద్ పాటిదార్ సన్నిహితుడు, అతను డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. వీరంతా వ్యాపారంలో భాగంగా రాజమండ్రి, ఒడిశా తదితర రాష్ట్రాలకు వెళ్లేవారు.కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలని పథకం వేసి మాదక ద్రవ్యాలను వాహనంలో తరలించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Temple : దర్శనం తర్వాత ఆలయంలో గుడి మెట్లపై కూర్చోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మీకు తెలుసా?
Related News
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉరుములతో కూడిన వర్షాలు
Hyderabad: 10 రోజులకు పైగా మండుతున్న ఉష్ణోగ్రతలను భరించిన హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలకు తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో రానున్న వడగాల్పుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలో మే 6 వరకు వడగాల్పుల హెచ్చరిక అమల్లో ఉండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మే 7 నుంచి ఉరుములు, మెర