Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు
హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి
- By Praveen Aluthuru Published Date - 06:54 PM, Sat - 30 December 23
Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినటట్టు మెట్రో రైల్ యాజమాన్యం తెలిపింది.
హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు (HMR) ప్రకటించింది. ఒంటిగంట వరకు అనుమతి ఇవ్వడంతో భద్రత ఏర్పాట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగబోవని స్పష్టం చేసింది మెట్రో. ఈ మేరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటుందని HMR పత్రికా ప్రకటనలో తెలిపింది.
సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్లలో ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 వరకు నడుస్తాయి. అయితే నూతన సంవత్సరం రోజున ప్రజలు సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు ఎక్కువగా బయట సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మెట్రో రైలుని అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన మెట్రో యాజమాన్యం జనవరి తెల్లవారుజాము వరకు మెట్రోని నడిపిస్తామని పేర్కొంది.
Also Read: Amla Benefits : చలికాలంలో ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
Related News
Heavy Rain In HYD : సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు