HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >How Prashant Kishor And Congress Split And Why They Are Making Up Now

PK Congress:ప్రశాంత్‌ కిషోర్‌, కాంగ్రెస్‌ ఎలా విడిపోయారు.. ఇప్పుడు ఎందుకు పొత్తుపెట్టుకుంటున్నారు..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్...కాంగ్రెస్ అగ్రనేతలు వరుసబెట్టి భేటీ అవుతున్నారు. గత పది నెలల్లో పీకే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం రెండోసారి. అంతకు ముందు గతేడాది జులైలో రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో చర్చలు జరిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ...

  • By Hashtag U Published Date - 12:09 PM, Wed - 20 April 22
  • daily-hunt
Prashant Congress Imresizer
Prashant Congress Imresizer

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్…కాంగ్రెస్ అగ్రనేతలు వరుసబెట్టి భేటీ అవుతున్నారు. గత పది నెలల్లో పీకే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం రెండోసారి. అంతకు ముందు గతేడాది జులైలో రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో చర్చలు జరిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ…పీకే నుంచి కానీ అధికారికంగా ఎలా ప్రకటనా వెలువడలేదు. కానీ ఈ సారి భేటీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. 2024లో జరగనున్న ఎలక్షన్స్ కు సంబంధించి సోనియా గాంధీకి, ఇతర కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్ కిషోర్ ప్రజెంటెషన్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే పీకే గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. తర్వాత ఎందుకు విభేదించారు..? పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు..? మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలన్న నిర్ణయం ఎందుకు  తీసుకున్నారు..?

గతంలో రాహుల్, కాంగ్రెస్ పై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు:
రాహుల్, కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా గతంలో  ప్రశాంత్ కిషోర్ ప్రకటనలు చేశారు. గతేడాది జులైలో…ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన రెండు సమావేశాల మధ్య ప్రశాంత్ కిషోర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల తర్వాత ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని..ఆయన్ను ఓడిస్తారని కాంగ్రెస్ నేతలు భ్రమపడొద్దు. ప్రజలు బీజేపీని తరిమేస్తారని రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. కానీ అలా జరగదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఓడినా…గెలిచినా భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. 40ఏ ళ్లుగా కాంగ్రెస్ ఉన్నట్లు బీజేపీ కూడా ఉంటుంది. జాతీయస్థాయిలో 30శాతం ఓట్లను సాధించిందంటే…అంత ఈజీగా కనుమరుగైపోయిందన్నారు.

2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ కోసం వ్యూహం రచించినా అది విజయం సాధించలేదు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు, డీఎం ఇంకా ఇతర పార్టీలతో కూడా పనిచేశారు. మమతా బెనర్జీ ద్వారా రాజకీయంగా ఏదోక అవకాశం కోసం ప్రయత్నించినా…అక్కడ కుదరలేదు. అందుకే కాంగ్రెస్ లేకుండా ఏదీ జరగదన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్  కిషోర్ చాలా సక్సెస్ అయ్యారు. బెంగాల్ అసెంబ్లీఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం, వ్యూహకర్తగా పీకే కెరీర్ లో రెండో అత్యత్తమ ఫలితం. 2014లో బీజేపీ విజయంలో  పీకే పాత్ర ఆయన కెరీర్ లోనే మొదటి ఎత్తు. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు..?పీకే కు ఆప్షన్లు చాలా పరిమితం. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.  2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, అఖిలేశ్‌లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రయోగం చేసినా అది కూడా సఫలం కాలేదు. బ్రూట్ మెజార్టితో యోగి ఆదిత్యనాథ్ గెలిచారు.  అక్కడే కాంగ్రెస్ కు పీకే మధ్య విభేదాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించింది. 2024 ఎన్నికలకు సంబంధించిన ఒక వివరణాత్మక బ్లూ ప్రింట్ ను కూడా పీకే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందించారు. త్వరలోనే పీకే కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్, పీకే…ఒకరికి ఒకరు ఎందుకు అవసరం..?

1. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీతో కలిసి పనిచేశారు. విజయవంతం అయ్యారు.
2. 2014లో లోకసభ ఎన్నికల్లో పీకే మళ్లీ బీజేపీతో కలిసి పనిచేశారు. మోదీ ప్రధాని అయ్యారు. 3. 2015లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కాంగ్రెస్ లో బీహార్ మహాఘటబంధన్ కోసం ప్రశాంత కిషోర్ పనిచేశారు.
3. 2017లో ఉత్తరప్రదేశ్ లో దో లడ్కే పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయితే పంజాబ్ లో అమరీందర్ సింగ్ తో కలిసి కాఫీ విత్ కెప్టెన్ పోల్ తో పనిచేశాడు.
4. 2019లో తెలంగాణలో టీఆరెస్ కు, ఏపీలో జగన్ మోహన్ రెడ్డికి, మహారాష్ట్రలో శివసేన విజయం సాధించడంతో పీకే పరుగు కొనసాగింది.
5. 2020లో అరవింద్ కేజ్రివాల్ తో కలిసి పనిచేశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో 79 సీట్లలో 63 సీట్లను ఆప్ గెలుచుకుంది.
6.2021లో వెస్ట్ బెంగాల్ టీఎంసీ, తమిళనాడులో డీఎంకేతో విజయాన్ని కొనసాగించారు.

2021లోనే కాంగ్రెస్ పార్టీలో పీకే చేరుతాడన్న వార్తలు వచ్చాయి. ఆగస్టు 2021లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుని కొనసాగిన పీకే బయటకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలకు దారితీసింది

2024లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది-ప్రశాంత్ కిషోర్ :

రాహుల్ శిబిరంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు పీకే చేరికను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పీకే ఆమోదయోగ్యం కానీ కొన్ని మార్పులు కోరుతున్నందున చర్చలు సఫలం కాలేదు. అయితే 2022లో ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అసమ్మతి స్వరాలు పెరిగాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ , పీకే మధ్య సయోధ్య కుదిరింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో బీజేపీ దాదాపు 20 ఏండ్లుగా అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ కు పీకే అవసరం.
2023లో కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే 2024కంటే ముందే పీకేకు రాజకీయ స్థానం అవసరం. అయితే ప్రశాంత్ కిషోర్ అందించిన బ్లూ ప్రింట్ ను సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడాన్ని కొంతమంది అగ్రనేతలు విభేధిస్తున్నారన్న సంగతి క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. పార్టీ పీకే అగ్రనాయకత్వాన్నికి కుడి భుజంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపార్టీలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉంది. పీకేకు పార్టీలో ముఖ్యపదవి ఇచ్చినట్లయితే…పార్టీని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని నేతలు భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లయితే పార్టీ నాయకత్వం చీలిపోతుందని…పీకేను పక్కన పెట్టాలన్న బలమైన వాదన వినిపిస్తోంది. గతంలోనూ పీకే కాంగ్రెస్ తో కలిసి పనిచేసినప్పుడు కొందరు అగ్రనేతలు పెద్దగా పట్టించుకోలేదు. పీకేకు పదవి కాదని..కేవలం సలహాదారునిగా మాత్రమే పార్టీలోకి రావాలని కోరకున్నారు. అయితే ఇప్పుడు సలహాదారునిగా కాకుండా పార్టీ నాయకుడిగా పనిచేయాలని పీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతిమ నిర్ణయం మాత్రం సోనియా గాంధీదే అవుతుంది.  పీకేకు టీఆరెస్, డీఎంకే, వైస్సార్ సీపీ వంటి ప్రాంతీయ పార్టీలతో  ఇప్పటికీ మంచి సమీకరణలు ఉన్నాయి. కాబట్టి  2024లో కాంగ్రెస్ మంచి ఫలితాలను రాబట్టాలంటే పీకే అవసరం చాలా ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • poll strategist
  • prashant kishor

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd