Suicide : ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఢిల్లీలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పహర్గంజ్ పోలీస్ స్టేషన్లో తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని
- By Prasad Published Date - 07:04 AM, Fri - 27 January 23
ఢిల్లీలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పహర్గంజ్ పోలీస్ స్టేషన్లో తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ సెంట్రల్ డిస్ట్రిక్ట్లోని జాగ్వార్ టీమ్లో నియమించబడిన హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ తెల్లవారుజామున 3.30 గంటలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం సెక్షన్ 174 CrPC కింద ప్రొసీడింగ్లు జరుగుతున్నాయని.. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో పోస్ట్మార్టం నిర్వహించి, అతని మృతదేహాన్ని హర్యానాలోని సోనిపట్లోని అతని స్వస్థలానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.
Tags
Related News
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.