America: సెక్స్ ఫోటోలతో వేధింపులు.. బాధితురానికి వేల కోట్ల పరిహారం?
తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి మహిళ పర్సనల్ సెక్స్ ఫోటోలతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అతనికి ది
- By Nakshatra Published Date - 04:53 PM, Fri - 18 August 23
తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి మహిళ పర్సనల్ సెక్స్ ఫోటోలతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అతనికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తూ వేల కోట్ల పరిహారం చెల్లించాలి అంటూ తీర్పును ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన ఒక మహిళ మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. వారు కలిసి షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత 2021 అక్టోబరులో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. వారు విడిపోయిన తరువాత నుంచి ఆమెను అతడు వేధింపులకు గురి చెయ్యడం పెట్టాడు.
ఈ క్రమంలోనే గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను శృంగార వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. వాటితో పాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ-మెయిల్ నుంచి సేకరించిన వ్యక్తిగత ఫొటోలను ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల ద్వారా పోస్టు చేశాడు. అలా పోస్టు చేసిన ఫొటోల లింకులను బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపాడు. వాటిని ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు నీ జీవితం సరిపోదు అంటూ ఆమెకు మొబైల్లో సందేశాలు పంపించేవాడు. దాంతో అతడి వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు కూడా ఆమెకు న్యాయం చేయకపోవడంతో ఆమె గత ఏడాది అనగా 2022 ఏప్రిల్లో టెక్సాస్లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో దావా వేశారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం ఒక వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను మాజీ భాగస్వామి ఇంటర్నెట్లో షేర్ చేయడం నేరం అంతే కాకుండా వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను రివెంజ్ పోర్న్ గా వ్యవహరిస్తారు. కేసు విచారణ సందర్బంగా ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,664 కోట్లు చెల్లించడం మాత్రమే కాకుండా ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు అనగా రూ.8,322 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు నిచ్చింది.
Tags
Related News
Chandrababu : చంద్రబాబు ఫారిన్ టూర్.. వారం పాటు అమెరికా పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.