Nalgonda : నల్గొండ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్ల నిలిపివేత
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది
- By Sudheer Published Date - 05:56 PM, Sun - 26 May 24
![Nalgonda : నల్గొండ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్ల నిలిపివేత](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/goods-train.jpg)
నల్గొండ (Nalgonda ) జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడం తో ఆ రూట్ లో వెళ్లే పలు రైళ్లను నిలిపివేశారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి తప్పిపోయాయి. రైలు పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు పడిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. తక్కువ వేగంతో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రమాదం కారణంగా గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడ వద్ద, జన్మభూమి ఎక్స్ప్రెస్ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. అయితే, గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
Read Also : MILK : ఆవు పాలు – గేదె పాలు.. మానవ శరీరానికి ఏది మంచిది..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/03/RPS20160709_141628-ImResizer.jpg)
Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త
Highway: నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోప�