Kasani Gnaneshwar: వచ్చే ఎన్నికల తర్వాత ముదిరాజులకు మంచి రోజులు : కాసాని జ్ఞానేశ్వర్
- By Balu J Published Date - 05:12 PM, Wed - 15 November 23
Kasani Gnaneshwar: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజ్ లకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తారు, వచ్చే ఎన్నికల్లో బారసా ప్రభుత్వాన్ని 3వ సారి అధికారంలోకి తెచ్చే బాధ్యత ముదిరాజ్ లపై ఉందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డా. బండా ప్రకాష్ ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..ముదిరాజ్ లు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జాతి ఉన్నారు.
జాతి కోసం సామజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టామని ముదిరాజ్ కులానికి సామజిక న్యాయం జరగాలనితెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ముదిరాజ్ కుటుంబాలకు మంచి రోజులు వస్తాయన్నారు. అందరికీ రాజకీయాల్లో సముచిత స్థానం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట ఇచ్చారని ఆయన తెలిపారు. 1970 నుండి అనేక మంది పెద్దలు ఎన్నో చెప్పారు నేటికీ ముదిరాజ్ లకు రావాల్సిన పదవులు దక్కలేదు. తర్వాత ఎన్నికల తదనంతరం మంచి జరుగుతుందన్నారు.
బీసీ లకు ఎలాంటి ముదిరాజ్ ల వల్ల ఇబ్బంది కలగదు. 70 కుల వృత్తులకు, ఫిషర్ మాన్స్ వస్తున్నాయి. విద్యార్ధులకు రిజ్వేషన్లపై మంచి జరుగుతందని అందరు కంకణ బద్దులై కలిసికట్టుగా, సీఎం కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రిని చేయాలని ముదిరాజ్ వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్,టిఎన్జీఓ మాజీ నేత మామిళ్ల రాజేందర్ ముదిరాజ్, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), కాసాని విరేశ్ ముదిరాజ్, అంబటి చెన్నయ్య ముదిరాజ్, ప్రకాష్ ముదిరాజ్, నిరంజన్ ముదిరాజ్, మేకల బిక్షపతి ముదిరాజ్, మహిళా నేత సావిత్రి ముదిరాజ్,వివిధ జిల్లాల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, తదితర పాల్గొన్నారు.
Related News
Congress Jana Jathara : ముదిరాజ్లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.