Gold Price Today: నిన్నటి పోలిస్తే పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,850గా నమోదైంది.
- By Gopichand Published Date - 07:39 AM, Wed - 10 May 23

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,850గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మే 10, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Karnataka Election 2023: నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్.. ఏర్పాట్లు పూర్తి..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,000గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,850 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,900గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,100 ఉండగా, ముంబైలో రూ.78,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.82,500 ఉండగా, కోల్కతాలో రూ.78,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,500 ఉండగా, కేరళలో రూ.82,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.82,500 ఉండగా, విజయవాడలో రూ.82,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.