4 Killed: యాదగిరిగుట్టలో విషాదం…పాత భవనం కూలి నలుగురు మృతి!!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది.
- By Hashtag U Published Date - 11:07 PM, Fri - 29 April 22
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
యాదగిరిగుట్లోని మెయిన్ రోడ్డులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్ ఎదురుకుండానే ఈ ఘటన సంభవించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాల్కనీ కూలిన రెండంతస్తుల భవనం దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. శిథిలాలు కిందపడుతున్న సమయలో ఈ శబ్దానికి కొందరు తప్పించుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
4 died after a slab of old building collapsed in #Yadadri. #Telangana Governor @DrTamilisaiGuv expressed shock over loss of lives & injured people, also advised district authorities to provide best medical care to those injured, while expediting rescue operations pic.twitter.com/8ZFDK5UlQH
— Aneri Shah (@tweet_aneri) April 29, 2022
Related News
Bhatti: భట్టికి జరిగిన అవమానంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం
Bhatti: యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ద