Nalgonda: హరిత చైతన్యం.. 50 ఏళ్ల 5 వృక్షాల రీలొకేషన్!
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఈ మాట ను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచాయి "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"
- By Hashtag U Published Date - 06:30 PM, Tue - 26 April 22
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఈ మాట ను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచాయి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” , “వట ఫౌండేషన్” సంస్థలు. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బై పాస్ వద్ద రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా 50 ఏళ్ల కు పైబడిన 5 మహా వృక్షాలను వేళ్ళతో సహా పెకిలించారు. అయితే వాటిని యధావిధిగా తీసుకెళ్లి చర్లపల్లిలోని అర్బన్ పార్కులోకి తరలించే బాధ్యతను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” , “వట ఫౌండేషన్” సంస్థలు తీసుకున్నాయి. ఇందుకోసం “వట ఫౌండేషన్” కు చెందిన 15 మంది వలంటీర్లు కృషి చేశారు. 50 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రేన్ తో ఆ 5 వృక్షాలను పెకిలించి.. ట్రక్కులోకి ఎక్కించి పార్కులో దింపారు. అక్కడ వాటిని మళ్లీ నాటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు చెందిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సహాయం అందించిందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు.
Related News
KCR : రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్
KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. We’re now on WhatsApp. Click to Join. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం�