Viral Video: దొంగ దొంగ అంటూ అరుపు.. రెస్టారెంట్ లో ప్రజలు పరుగో పరుగు!
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయించే విధంగా
- By Nakshatra Published Date - 04:47 PM, Tue - 27 September 22
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉండగా మరికొన్ని ఏడిపించే విధంగా కూడా ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఆ వీడియోలో దొంగలు లేరు ఏమీ లేరు. అదేంటా అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. బ్రెజిల్లోని రెసిఫ్ రాష్ట్రం.
రోడ్డు పక్కనే కాలిబాట పై ఉన్న ఓ రెస్టారంట్ వినియోగదారులతో ఫుల్ రష్ గా ఉంది. ఇంతలోనే స్థానికంగా ఓ జిమ్కు చెందిన బృందం వారి మధ్యలోంచి చిన్నగా పరుగులు పెడుతూ ముందుకు సాగింది. అందులో ఒక మహిళ.. ఎవరో ఛేజ్ చేస్తున్నట్లు వెనక్కు తిరిగి చూసింది. అది గమనించిన ఆ రెస్టారెంట్ లోని వినియోగదారులు ఎవరు దొంగలు వారిని వెంబడిస్తున్నారు అని పొరపాటు పడ్డారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు.
A group of people doing CrossFit ran passed a restaurant
Dozens of diners thought they were escaping from something and abandoned their tables to run off too. This happened in Brazil 1/🧵pic.twitter.com/7lmpt2zHY7
— Science girl (@gunsnrosesgirl3) September 25, 2022
దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ రెస్టారెంట్ వాతావరణం ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అందుకు సంబంధించిన ఘటన అంతా కూడా చూస్తుండగానే చాలా వేగంగా జరిగిపోయింది. అయితే ఎక్కడున్న వినియోగదారులు అపార్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది అన్ని రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది.
Related News
Adriana Thyssen : అంతుచిక్కని వ్యాధితో మరణించిన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఇన్ఫ్లూయన్సర్
బ్రెజిల్ కు చెందిన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఇన్ఫ్లూయన్సర్ అడ్రియానా థైసెన్ (49)(Adriana Thyssen) అంతుచిక్కని వ్యాధితో మరణించింది.