Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు
- Author : Prasad
Date : 06-07-2023 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం తిరుమలలో 21 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. దర్శనాలు పూర్తి కావడానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం నాడు 77,299 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా.. 30,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా ఆలయానికి రూ.3.93 కోట్లు ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.