MP Arvind: తెలంగాణ పోలీస్ కు డెడ్ లైన్
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పి జరిగిన దాడిపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది.
- By Hashtag U Published Date - 10:00 PM, Fri - 4 February 22
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పి జరిగిన దాడిపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు డెడ్ లైన్ పెట్టింది. ఎంపీ అర్వింద్ ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోమ్ శాఖ నోటీస్ లు జారీ చేసింది. విచారణ వేగంగా జరపాలని కోరింది. ప్రధాని పర్యటన క్రమంలో వ్యక్తిగత హాజరు కాలేకపోయామని ప్రివిలేజ్ కమిటీకి డీజీపీ, ఇతర అధికారులు తెలపడంతో ఆ మేరకు నోటీస్ లు ఇచ్చారు.
అర్వింద్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిజామాబాద్ కలెక్టర్, సీపీ, ఆర్మూర్ పోలీసులకు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గత నెల 25న నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. గత 30న ప్రివిలేజ్ కమిటీకి అర్వింద్ ఫిర్యాదు చేశారు. విచారించిన కమిటీ తెలంగాణ పోలీసులకు 15 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఆ లోపు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Related News
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి: డీజీపీ రవి గుప్తా
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలను, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత & రైల్వేల విభాగపు అడిషనల్ డీ