Dasoju: తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్కు నోటీసులా? : దాసోజు
- By Balu J Published Date - 09:46 PM, Thu - 13 June 24
Dasoju: పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పరిపాలన అద్వాన్నంగా మారిందని బీ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు అన్నారు. గురువారం సీఎం రేవంత్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులా?? తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా?? ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు సంజాయిషీ నోటీసులా?? అంటూ ప్రశ్నలు సందించారు.
‘‘రేవంత్ రెడ్డి మీ ప్రతీకార రాజకీయాలను ప్రక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదు. హామీల అమలు చేతకాని గుంపుమెస్త్రీగా డివెర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు మీరు తెరలేపారు’’ అంటూ దాసోజు ఫైర్ అయ్యారు.
Related News
BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్
BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్�