Gold Seized : జైపూర్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
జైపూర్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35 లక్షలు ఉంటుందని
- By Prasad Published Date - 06:25 AM, Mon - 29 May 23
జైపూర్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని జైపూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. స్పైస్జెట్ విమానంలో దుబాయ్ నుంచి జైపూర్కు వచ్చిన ఓ నిందితుడిని రూ.35 లక్షలకు పైగా విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ విభాగం ఆదివారం విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆ వ్యక్తి లిక్విడ్ రూపంలో అక్రమంగా 583 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్తున్నాడు. టార్చ్లో బంగారాన్ని దాచి ఉంచినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది.
జైపూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం ధరను అంచనా వేయడానికి వాల్యూయర్లను జైపూర్ విమానాశ్రయానికి పిలిపించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.35 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
Related News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.