Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
- Author : HashtagU Desk
Date : 05-03-2022 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 289 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 11,651 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది.
ఇక ఇండియలో ఇప్పటి వరకు 4,29,45,284 కరోనా కేసులు నమోదవగా, 5,14,878 4 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 4,23,78,721 మంది కోరుకున్నారని, దీంతో ప్రస్తుతం ఇండియలో 63,878 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉంది.మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1,78,55,66,940 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్రం వెల్లడించింది.