Delhi: ఢిల్లీలో చలిపులి.. వణికిపోతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదవడంతో ప్రజలు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
- By Hashtag U Published Date - 09:44 AM, Tue - 25 January 22
దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదవడంతో ప్రజలు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలకు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానూ, కొండ ప్రాంతాల్లో 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానూ ఉంటే చలి రోజుగా IMD చెబుతోంది. ‘చల్లని రోజు’లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 నుండి 6.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి.
సోమవారం తెల్లవారుజామున నుంచే పొంగమంచు దట్టంగా కమ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు నత్తనడకన సాగడంతో పలుచోట్ల ట్రాఫిక్కు కూడా పాక్షికంగా అంతరాయం ఏర్పడింది. గాలి వీయకపోవడంతో రోజంతా వాతావరణం ప్రశాంతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 14.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
Tags
Related News
Flights Delayed: ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాలకు అంతరాయం.. కారణమిదే..?
ఢిల్లీ-ఎన్సిఆర్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీని కారణంగా ఇక్కడ సాధారణ జీవితం ప్రభావితమైంది. ఇది రోడ్ల నుండి వాయుమార్గాల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. సమాచారం ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాల (Flights Delayed)కు అంతరాయం ఏర్పడింది.