CM Jagan: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు.
- By Hashtag U Published Date - 01:32 PM, Sat - 15 January 22
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు.
తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగు పంచెకట్టుతో ఆయన గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
సీఎం దంపతులు గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు.
AP CM YS Jagan Participating in Sankranthi Celebrations at Goshala Near Camp Officehttps://t.co/fM9ZOmrdN7
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 14, 2022
Related News
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్న�