CJI: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంతూరికి!
- By Balu J Published Date - 02:54 PM, Fri - 24 December 21
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ పై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపు తో మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగింపు కు ముందు నిలిచిన అలంకృత మైన అశ్వాలు అందరిని కనువిందు చేశాయి. జస్టీస్ ఎన్వీ రమణ రాకతో ఊరంతా సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది. నాయకులు, అధికారులు ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.
Tags
Related News
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.