Chetak: చేతక్ స్కూటీలు మరింత తొందరగా.. బజాజ్ కీలక నిర్ణయం
బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. చేతక్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. చేతక్ విద్యుత్ స్కూటర్ల తయారీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి 10 వేల స్కూటర్లను తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.
- By Nakshatra Published Date - 10:44 PM, Fri - 28 April 23
Chetak: బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. చేతక్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. చేతక్ విద్యుత్ స్కూటర్ల తయారీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి 10 వేల స్కూటర్లను తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. చేతక్ విద్యుత్ స్కూటీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. దీని కారణంగా ఉత్పత్తిని కూడా పెంచాలని, మరిన్ని తయారుచేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విషయం తాజాగా బజాజ్ ఆటో స్పష్టం చేసింది.
చేతక్ విద్యుత్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా పెంచనున్నామని, జూన్ నాటికి 10 వేల మైలురాయిని అందుకోవాలని చూస్తున్నామని బజాబ్ ఆటో వెల్లడించింది. అలాగే తమ సేల్స్ నెట్ వర్క్ని కూడా బజాజ్ ఆటో పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం సెప్టెంబర్ కల్లా 150 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను దేశవ్యాప్తంగా ఓపెన్ చేయనుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ స్పష్టం చేవారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 5 వేలు మాత్రమే ఉందని, దానిని ఇప్పుడు 7 వేలకు, జూన్ నాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
విడిభాగాల విషయంలో వెండర్లు జాప్యం చేస్తుండటం కారణంగా ఉత్పత్తి తగ్గతుందని, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వడంతో ఉత్పత్తి సామర్థ్యం పెంచడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దీని వల్ల ఉత్పత్తి పెంపుపై మరింత విశ్వాసం పెరిగిందని రాకేశ్ శర్మ స్పష్టం చేశారు.
అయితే ప్రస్తతుం చేతనే విద్యుత్ స్కూటర్ వెయింటింగ్ పీరియడ్ 20 నుంచి 25 రోజులుగా ఉంది. కానీ మే నుంచి 3 నుంచి 5 రోజరులకు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం 88 పట్టణాల్లో మాత్రమే డీలర్ షిప్ కేంద్రాలు ఉన్నాయి. కానీ సెప్టెంబర్ నాికి 120 పట్టణాల్లో 150 స్టోర్లను తీసుకురావాలని చూస్తోందిజ
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.