AP : కేవలం లోకేష్ , భువనేశ్వరి లకు మాత్రమే చంద్రబాబును కలిసే అవకాశం ఇస్తున్న పోలీసులు
ఓ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ పార్టీ అధినేత..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 05:57 PM, Sat - 9 September 23
ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను CID అధికారులు అరెస్ట్ చేశారనే వార్త..కేవలం టీడీపీ పార్టీ నేతలనే కాదు ఇతర పార్టీ నేతలను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఓ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ పార్టీ అధినేత..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు కురిపించారు.
ఇక మొదటి నుండి చంద్రబాబు కు అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఏ తప్పూ చేయని జనసేన పార్టీ నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు. అలాంటిది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు దారుణం అని పవన్ అన్నారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా చంద్రబాబు ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సింది పోలీసులే కదా..? అలాంటిది లా అండ్ ఆర్డర్ విషయంలో వైసీపీకి సంబంధమేంటి ? అని పవన్ ప్రశ్నించారు. నాయకుడు అరెస్టైతే.. అభిమానులు రోడ్లపైకి రాకుండా..మద్దతు తెలుపకుండా ఎలా ఉంటారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను ఇళ్లలో నుంచి బయటకు రాకూడదంటే ఎలా..? మీ నాయకులు అక్రమాలు, దోపిడీ చేసినా విదేశాలకు వెళ్లొచ్చు..ఒక నాయకుడు అరెస్టైతే కార్యకర్తలు బయటకురావొద్దా? ఇదేమి ప్రజాస్వామ్యం అని పవన్ ప్రశ్నించారు. తన సంపూర్ణ మద్దతు చంద్రబాబు కు ఇస్తున్నట్లు ఉదయమే తెలిపారు.
ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ..చంద్రబాబు అరెస్ట్ అని తెలిసి..తన షూటింగ్ లకు ప్యాకప్ చెప్పి..ప్రత్యేక విమానంలో విజయవాడ కు చేరుకున్నారు. సిట్ ఆఫీస్ లో చంద్రబాబు ను కలవాలని అనుకున్నప్పటికీ , పోలీసులు మాత్రం పవన్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేశ్కు మాత్రమే అనుమతిస్తాం అని తేల్చి చెపుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ సిట్ ఆఫీస్ కు వస్తారా..? లేక వెనుతిరిగి వెళ్తారా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం చంద్రబాబు కుంచనపల్లి సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. సిట్ అధికారులు విచారణ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుండి దాదాపు 11 గంటపాటు చంద్రబాబు జర్నీ చేయడంతో కాసేపు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
Related News
AP : ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్ల దాడి
Lavu Sri Krishnadevaraya: ఏపిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్(General Election Polling) సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు రావటానికి వీలులేదని వైసీపీ వర్గీయులు వారించగా.. వచ్చే హక్కు ఉందని �