Chandrababu Naidu: నేలపై కూర్చొని.. కార్యకర్త సమస్య తెలుసుకొని!
పార్టీ కార్యకర్త కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నేలపై కూర్చున్నారు.
- By Balu J Published Date - 03:53 PM, Fri - 2 December 22
పార్టీ కార్యకర్త కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నేలపై కూర్చున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరులో తాళ్లపూడికి చెందిన దివ్యాంగ కార్యకర్త శ్రీనివాస్.. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పక్కనే చంద్రబాబు కింద కూర్చొని అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలియోతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని శ్రీనివాస్ ఆయనకు తెలిపారు. చాలాకాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నారని పక్కనే ఉన్న ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తరఫున శ్రీనివాస్కు ఆర్థికసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దివ్యాంగుడైన పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీనివాస్ కోసం నేలపై కూర్చున్న అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అతని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్కు పార్టీ తరపున ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు.#CBNInKovvur#NCBN#TDPforDevelopment pic.twitter.com/hafhjzb0AQ
— Telugu Desam Party (@JaiTDP) December 2, 2022
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.