Agnipath : ఆగస్ట్ 7 నుండి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచార చేయనున్న భారతీయ కిసాన్ యూనియన్
అగ్నిపథ్కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ఆగస్టు 7 నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు.
- By Prasad Published Date - 10:06 AM, Thu - 4 August 22
అగ్నిపథ్కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ఆగస్టు 7 నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని తిక్రీ ప్రాంతంలో రైతుల సభను ఉద్దేశించి టికైత్ మాట్లాడుతూ, ఈ సమస్యపై “కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పోరాటం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం ఆగస్ట్ 7 నుండి ప్రారంభమవుతుందని..ఒక వారం పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే వారిపై పాత పోలీసు కేసులను తవ్వేస్తున్నారని ఆరోపించారు.
Related News
ECI : ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
ECI: రానున్న ఎన్నికల్లో(election)ఈవీఎంలు(EVMs), వీవీ ప్యాట్ల(VV Patla) వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) లాంఛనంగా ఆదేశాలు జారీ( orders Issuance) చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర�