Nellore Murder: నెల్లూరులో దంపతుల దారుణ హత్య
నెల్లూరులోని విద్యుత్ శాఖా కార్యాలయం వద్ద శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణారావు దంపతులను కొందరు దుండగులు నిన్నరాత్రి దారుణంగా హత్యచేసి, వారి ఇంట్లో విలువైన ఆభరణాలు దోచుకువెళ్లారు.
- By HashtagU Desk Published Date - 12:39 PM, Sun - 28 August 22
నెల్లూరులోని విద్యుత్ శాఖా కార్యాలయం వద్ద శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణారావు దంపతులను కొందరు దుండగులు నిన్నరాత్రి దారుణంగా హత్యచేసి, వారి ఇంట్లో విలువైన ఆభరణాలు దోచుకువెళ్లారు. మినీ బైపాస్ రోడ్డు సమీపంలోని కన్వెన్షన్ హాల్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. తొలుత కృష్ణారావు భార్య సునీత గొంతు కోసి హత్య చేశారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణారావుపై దాడి చేసి హత్యచేశారు. అనంతరం ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు దంపతుల మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News
AP Congress 2nd List: 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.