Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్
ఢిల్లీ లిక్కర్ స్కాములో మరో సంచలనం. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు
- By Praveen Aluthuru Published Date - 01:19 PM, Sat - 29 April 23
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాములో మరో సంచలనం. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు. దీంతో బీఆర్ఎస్ లో ఓ రకమైన టెన్షన్ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే దినేష్ అరోరాని సీబీఐ అరెస్ట్ చేసింది. పలు కోణంలో అతనిని విచారించింది. చివరికి దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఇక ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు తాజాగా అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.
బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీలో సౌత్ గ్రూప్ కు బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై రిప్రజెంటర్ గా వ్యవహరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు అప్రూవర్ గా మారారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ తాజాగా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 209 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది. బుచ్చిబాబు అప్రూవర్ గా మారడం ద్వారా కవితకు ఏమైనా సమస్య తలెత్తుతుందా అన్న కోణంలో పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. అయితే కవితను నిందితురాలిగా కాకుండా అనుమానితురాలిగానే చూసింది. ఈ మేరకు కవిత బ్యాంకు లావాదేవీలపై ఫోకస్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించింది.
Read More: Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్కడ? మౌనిక మరణ పాపం ఎవరిది?
Related News
Kejriwal : నేను తిరిగి జైలుకు వెళ్లక్కర్లేదు..ఢిల్లీ ఓటల్లకు కేజ్రీవాల్ పిలుపు..
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టై జైలుకు వెళ్లిన సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే జైలు నుండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇచ్చింది.. ఎన్నికలు పూర్తయ్యాక నేను త